Corona Virus: దేశంలో 93 వేలు దాటిన కరోనా మరణాలు

Indias COVID19 case tally crosses 59 lakh mark

  • 24 గంటల్లో  85,362 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933
  • మృతుల సంఖ్య మొత్తం 93,379
  • కోలుకున్న 48,49,585 మంది  

దేశంలో కరోనా కేసుల సంఖ్య 59 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 85,362 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,089 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 93,379కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 48,49,585 మంది కోలుకున్నారు. 9,60,969 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,02,69,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 13,41,535 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News