Indian Railways: ప్రారంభమైన రైళ్ల పరుగులు.. ప్రయాణికులు ఇవి పాటించాల్సిందే!

Trains starts journey after Corona lock down

  • నిర్ణీత సమయానికి ముందే స్టేషన్‌కు రావాలి
  • ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలి
  • హెల్త్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి

సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో రైళ్లు మళ్లీ పరుగులు ప్రారంభించాయి. అన్‌లాక్-4లో భాగంగా ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణం చేసేవారు కేంద్రం సూచించిన కరోనా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఈస్ట్‌కోస్ట్ వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ పేర్కొన్నారు. టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రమే స్టేషన్‌కు రావాలని, రైలు ఎక్కేటప్పుడు ప్రయాణికులు విధిగా మాస్క్/ఫేస్ షీల్డ్ ధరించాలని సూచించారు.

స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు కాబట్టి నిర్ణీత సమయం కంటే ముందే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. స్టేషన్‌లోనూ, రైలులోనూ భౌతిక దూరం తప్పనిసరని  స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్ ప్రొటోకాల్‌ను అనుసరించాలని సూచించారు. అలాగే, ప్రయాణికులందరూ ఎవరికి వారే తమ సొంత దుప్పట్లను వెంట తెచ్చుకోవాలని త్రిపాఠీ కోరారు.

Indian Railways
Train Passengers
Corona Virus
Health protocals
  • Loading...

More Telugu News