Antharvedi: జగన్ కీలక నిర్ణయం.. సీబీఐకి అంతర్వేది రథం దగ్ధం కేసు!

Jagan decides to handover Antarvedi case to CBI

  • అంతర్వేదిలో దగ్ధమైన స్వామివారి రథం
  • రాష్ట్ర ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • సీబీఐ విచారణకు అప్పగించాలని డీజీపీకి సీఎం ఆదేశం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలన్న భావనతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో, సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనికి సంబంధించి రేపు జీవో వెలువడనుంది.

  • Loading...

More Telugu News