rajnath singh: మీ చ‌ర్య‌ల‌కు ప్ర‌తిగా ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా భార‌త్ సిద్ధం: చైనాకు తేల్చిచెప్పిన రాజ్ నాథ్

we are ready to fight rajnath

  • వెనకడుగు వేసేదిలేదు
  • చైనా త‌మ దళాలను మోహరిస్తోంది
  • దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డాన్ని  వ్యతిరేకిస్తున్నాం
  • ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌పై చైనా రక్షణ మంత్రితో భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యాలో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చైనాకు చెప్పిన అంశాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.  

భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే అందుకు ప్ర‌తిగా ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేసేది లేదని చైనాకు రాజ్ నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. గల్వాన్‌ లోయతో పాటు వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో ఇటీవల చైనా వ‌ల్ల చోటు చేసుకున్న‌ పరిణామాలపై రాజ్‌నాథ్‌ నిరసన వ్యక్తం చేశారని వివ‌రించింది.

చైనా త‌మ దళాలను మోహరిస్తూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డాన్ని ఆయ‌న‌ వ్యతిరేకించారని పేర్కొంది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న ఒప్పందాలను డ్రాగ‌న్ దేశం ఉల్లంఘిస్తోంద‌ని ఆయ‌న చెప్పారని తెలిపింది. సరిహద్దు భద్రత విషయంలో భారత సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చైనాకు ఆయ‌న గుర్తు చేశారు.

ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల్ని అమలు చేయాలని అన్నారు. త‌మ‌ దళాలను నియంత్రించే వ్యవస్థను చైనా పటిష్ఠం చేయాలని, పరిస్థితులు మరింత దిగజారేలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని అన్నారు. శాంతి, సుస్థిరతల కోసం చైనా సహకారం కావాలని ఆయ‌న‌ కోరారు.

  • Loading...

More Telugu News