China: చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది మృతి.. ఫొటోలు ఇవిగో

29 dead in collapse of a restaurant in China

  • శాంషీ ప్రావిన్సులో ఘటన
  • శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు
  • ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు

చైనాలోని  శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్‌ కుప్పకూలి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగిస్తోన్న సిబ్బంది ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఆ రెస్టారెంటులో ఓ పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో రెస్టారెంటు ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

               
           

  • Loading...

More Telugu News