Corona Virus: భారత్‌లో ఒక్క రోజులో అత్యధికంగా 69,878 కేసులు

India records biggest single day jump of 69878 cases in 24 hours

  • మొత్తం కేసులు 29,75,702 
  • మృతుల సంఖ్య మొత్తం 55,794
  • 6,97,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 22,22,578 మంది  

భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 69,878 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 945 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,75,702 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 55,794కి పెరిగింది. ఇక 6,97,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,22,578 మంది కోలుకున్నారు.
                                                                                                           
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,44,91,073 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,23,836 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News