MS Dhoni: ధోనీకి గౌరవంగా వీడ్కోలు పలకాలనే యోచనలో బీసీసీఐ!

BCCI to conduct farewell match for Dhoni

  • ఐపీఎల్ తర్వాత ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించే యోచనలో బీసీసీఐ
  • ధోనీతో సంప్రదింపులు జరుపుతామన్న బీసీసీఐ అధికారి
  • ఐపీఎల్ సమయంలో వెలువడనున్న అధికారిక ప్రకటన

భారత క్రికెట్ జట్టు దూకుడును కెప్టెన్ గా గంగూలీ పెంచితే... ఆ తర్వాత పగ్గాలను చేపట్టిన ధోనీ జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. టీమిండియాపై ధోనీ చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. జట్టులో యువరక్తాన్ని నింపి, ఎన్నో టోర్నీలలో జయకేతనం ఎగురవేశాడు.

భారత జట్టుకు ఎంతో సేవ చేసిన ధోనీ అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే, ధోనీకి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలకాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ పూర్తైన తర్వాత ఆయన కోసం ఒక ఫేర్ వెల్ మ్యాచ్ ను నిర్వహించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఐపీఎల్ జరిగే సమయంలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. దీనికి సంబంధించి ధోనీతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ధోనీలాంటి  లెజెండ్ ను గౌరవించడం బీసీసీఐకు గౌరవమని అన్నారు.

MS Dhoni
BCCI
Farewell Match
  • Loading...

More Telugu News