Corona Virus: దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 69,652 కరోనా కేసులు

Spike of 69652 cases and 977 deaths reported in India

  • మొత్తం కేసులు 28,36,926 
  • మృతుల సంఖ్య మొత్తం 53,866
  • 6,86,395 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 20,96,665 మంది  

భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69,652 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 977 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 28,36,926 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 53,866 కి పెరిగింది. ఇక 6,86,395 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,96,665 మంది కోలుకున్నారు.
                                                                                
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,26,61,252 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

  • Loading...

More Telugu News