Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ.. తాజా అప్‌డేట్స్‌

coronavirus cases in telangana

  • కొత్తగా  23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
  • 1724 మందికి కరోనా పాజిటివ్‌
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 97,424
  • ఆసుపత్రుల్లో 21,509  మందికి చికిత్స  

తెలంగాణలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా  23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1195 మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  97,424కు చేరింది. ఆసుపత్రుల్లో 21,509 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 75,186 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 729కు చేరింది. జీహెచ్‌ఎంసీలో 395 మందికి కొత్తగా కరోనా సోకింది.  తెలంగాణలో మొత్తం 8,21,311మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
                               

  • Loading...

More Telugu News