Corona Virus: దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. తాజా అప్‌డేట్స్‌

Spike of 64531 cases and 1092 deaths reported in India

  • 24 గంటల్లో 64,531 మందికి కరోనా 
  • మొత్తం కేసులు 27,67,274
  • మృతుల సంఖ్య మొత్తం 52,889
  • 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స

దేశంలో కరోనా కేసులు, మరణాల ఉద్ధృతి కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 64,531 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,092 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,67,274కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 52,889 కి పెరిగింది. ఇక 6,76,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,37,871 మంది కోలుకున్నారు.
                                                                                  
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,17,42,782  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,518 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

  • Loading...

More Telugu News