balasubramaniam: ఐసీయూలో బాలసుబ్రహ్మణ్యానికి.. ఆయన పాటలు వినిపిస్తోన్న వైద్యులు!

balasubrahmaniam listens his songs in hospital

  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • బాలు భార్యకు కూడా కరోనా
  • వివరాలు చెబుతున్న కుమారుడు చరణ్

కరోనా సోకడంతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ క్రమంలో గతంలో బాలు పాడిన కొన్ని పాట‌ల‌ను ఆయనకు వినిపిస్తున్నార‌ని తెలిసింది.

ఆయన ఉన్న వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ పాటలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, బాలసుబ్రహ్మణ్యం భార్య కూడా క‌రోనాతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు చ‌ర‌ణ్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News