ఆసుపత్రిలో చేరడానికి వారం ముందు పనసపండు కావాలని కోరిన ప్రణబ్ ముఖర్జీ!
- ఇటీవల జరిగిన ఒక ఘటన గురించి వివరించిన ప్రణబ్ కుమారుడు
- పనసపండును ఎంతో ఇష్టంగా తిన్నారన్న అభిజిత్ ముఖర్జీ
- షుగర్ లెవెల్స్ కూడా పెరగలేదని వెల్లడి
తన తండ్రి పనసపండును ఎంతో ఇష్టంగా తిన్నారని... ఆయనకు షుగర్ లెవెల్స్ కూడా పెరగలేదని అభిజిత్ చెప్పారు. ఎంతో హ్యాపీగా ఉన్న ఆయన... అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా అని తేలిందని... ఆ తర్వాత మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ కూడా చేశారని చెప్పారు. నాన్నను చూసేందుకు నాలుగు సార్లు ఆసుపత్రికి వెళ్లానని ... చివరిసారి చూసినప్పుడు ఆయన శ్వాస కూడా నిలకడగా ఉండటాన్ని గమనించానని తెలిపారు.