Devineni Uma: కొవిడ్ కేసుల పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటిస్థానం: దేవినేని ఉమ విమర్శలు

devineni fires on ycp

  • నిన్న10,128 కేసులు,77 మరణాలు
  • యాక్టివ్ కేసులలో రెండవస్థానం
  • మరణాల విషయంలోనూ అగ్రభాగం
  • వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు?  

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతోన్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారో తెలియడం లేదని ఆయన అన్నారు.

'నిన్న10,128 కేసులు,77 మరణాలు. కొవిడ్ కేసుల పెరుగుదలలో దేశంలో మొదటిస్థానం.. యాక్టివ్ కేసులలో రెండవస్థానం. మరణాల విషయంలోనూ అగ్రభాగం. కరోనా కోసం మీరు ఖర్చుచేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు? కొవిడ్ ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు' అని దేవినేని ఉమా నిలదీశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.

Devineni Uma
Telugudesam
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News