Devineni Uma: ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా?: దేవినేని ఉమ

devineni fires on ycp

  • 29 వేల రైతు కుటుంబాలు 34 వేల ఎకరాల భూములిచ్చాయి
  • వారికి అన్యాయం చేస్తారా?
  • రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలు
  • అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'నేల తల్లిపై మమకారాన్ని చంపుకొని 29 వేల రైతు కుటుంబాలు 34 వేల ఎకరాల భూములిస్తే అన్యాయం చేస్తారా? ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా? రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలు. అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావు, కార్యాలయాలు తరలిస్తే మిగిలేది శూన్యమంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా వైఎస్ జగన్ గారు?' అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.

Devineni Uma
Telugudesam
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News