Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్స్: 24 గంటల్లో 63 మరణాలు, 7,822 కొత్త కేసులు

Corona cases increased rapidly in Andhra Pradesh

  • రాష్ట్రంలో 1,537కి చేరిన కరోనా మరణాలు
  • తాజాగా 5,786 మంది డిశ్చార్జి
  • ఇంకా 76,377 మందికి చికిత్స

ఏపీలో కరోనా వైరస్ భూతం స్వైరవిహారం చేస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 7,822 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కి చేరింది. ఈ రోజు తూర్పు గోదావరి (1,113), విశాఖపట్నం (1,049) జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. అటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 63 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,537కి చేరింది. కొత్తగా 5,786 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 88,672 కాగా, ప్రస్తుతం 76,377 మంది చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News