సుశాంత్ ఆత్మహత్య కేసు: నటి రియా చక్రవర్తి ఇంటినుంచి అదృశ్యం
- సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు
- ప్రశ్నించేందుకు ముంబై వచ్చిన బీహార్ పోలీసులు
- అదృశ్యమైన నటి.. లుక్ అవుట్ నోటీసుల జారీ
అయితే, ఆమె నివాసానికి చేరుకున్న పోలీసులకు నిరాశే ఎదురైంది. బీహార్ పోలీసులు రావడానికి ముందే ఆమె తన ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో పోలీసులు ఆమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది సతీవ్ మనీషిండే తెలిపారు.