Corona Virus: దేశంలో కరోనాతో ఒక్కరోజులో 587 మంది మృతి

Spike of 37148 cases and 587 deaths reported in India in the last 24 hours

  • గత 24 గంటల్లో  37,148 మందికి కొత్తగా కరోనా      
  • మొత్తం కేసులు 11,55,191
  • మృతుల సంఖ్య 28,084
  • 4,02,529 మందికి ఆసుపత్రుల్లో చికిత్స

భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 37,148 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 587 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 11,55,191కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 28,084కి పెరిగింది. 4,02,529 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,24,578 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,43,81,303 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,395 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News