ప్రభాస్ సినిమాకి మరోసారి కీరవాణి సంగీతం?
- 'బాహుబలి' సీరీస్ కి పనిచేసిన కీరవాణి
- తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్
- సంగీతానికి చిత్రంలో అధిక ప్రాధాన్యత
- కీరవాణితో ప్రస్తుతం సంప్రదింపులు
ఈ క్రమంలో తాజాగా కీరవాణితో ఈ విషయంలో సంప్రదింపులు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఆయన కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు, దాంతో సానుకూలంగా స్పందిస్తున్నట్టు చెబుతున్నారు. మరోపక్క, ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఫిక్స్ చేసుకుందామని అనుకున్నప్పటికీ, ఆమె భారీ స్థాయిలో పారితోషికం అడగడంతో, ప్రస్తుతం కియరా అద్వానీ పట్ల దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.