అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు సోకిన మహమ్మారి వైరస్
- నాలుగు రోజుల క్రితం పరీక్షలు
- పాజిటివ్ రాగానే ముంబయి నానావతి ఆసుపత్రికి తరలింపు
- అభిమానులు ఆందోళన చెందవద్దన్న బిగ్ బీ
అమితాబ్ భార్య జయాబచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్ లకు నెగటివ్ వచ్చింది. మిగతా కుటుంబీకుల రిపోర్టులు వెల్లడికావాల్సి వుంది. అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రముఖులు ట్వీట్ల ద్వారా కోరుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "అమితాబ్ ఓ యోధుడు... ఆయన త్వరగా కోలుకుని బయటకు వస్తారు" అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సచిన్, యువరాజ్ తదితరులు ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా సోకడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున సైతం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.