Rahul Gandhi: అంత బాధగా ఉందా? అంటూ రాజ్ నాథ్ సింగ్ కు ఐదు ప్రశ్నలను సంధించిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi fires on Rajnath Singh

  • సైనికుల మృతి పట్ల ఈ ఉదయం సంతాపం ప్రకటించిన రాజ్ నాథ్
  • సంతాపం ప్రకటించడానికి రెండు రోజుల సమయం పట్టిందా అంటూ రాహుల్ మండిపాటు
  • చైనా పేరును ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం

సరిహద్దుల్లో సైనికులను కోల్పోవడం చాలా బాధను కలిగిస్తోందంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఉదయం చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. సైనికుల ప్రాణ త్యాగాలపై స్పందించేందుకు రెండు రోజుల సమయం పట్టిందా? అని మండిపడ్డారు. 'మీకు అంత బాధగా ఉంటే... ' అంటూ రాజ్ నాథ్ కు ఐదు ప్రశ్నలు సంధించారు.

  • మీ ట్వీట్ లో చైనా పేరును ప్రస్తావించకుండా ఇండియన్ ఆర్మీని ఎందుకు కించపరిచారు?
  • అమర జవాన్లకు సంతాపం ప్రకటించడానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది?
  • జవాన్లు అమరులవుతూ ఉంటే... వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ప్రసంగాలు ఎందుకు చేశారు?
  • మీ అనుకూల మీడియాతో ఆర్మీని విమర్శింపజేస్తూ ఎందుకు దాక్కున్నారు?
  • పెయిడ్ మీడియాతో భారత ప్రభుత్వానికి బదులు ఆర్మీపై ఎందుకు నిందలు వేయించారు? అని రాహుల్ ప్రశ్నించారు. అంతకు ముందు ప్రధాని మోదీపై కూడా రాహుల్ మండిపడ్డారు. ఇంత జరిగినా స్పందించకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.

Rahul Gandhi
Congress
Rahnath Singh
BJP
Soldiers
  • Loading...

More Telugu News