Corona Virus: ఏపీలో మరో రెండు కరోనా మరణాలు... తాజాగా 193 మందికి పాజిటివ్

Two more corona deaths in AP

  • రాష్ట్రంలో 88కి పెరిగిన కరోనా మరణాలు
  • 5,280కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • ఇప్పటివరకు 2,851 మంది డిశ్చార్జి

ఏపీలో కరోనా తీవ్రత మరింత విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఇద్దరు మరణించారు. చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి పెరిగింది. కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,280కి చేరింది. ఇప్పటివరకు 2,851 మంది డిశ్చార్జి కాగా, 2,341 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 81 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Corona Virus
Deaths
Andhra Pradesh
Positive
COVID-19
  • Loading...

More Telugu News