Corona Virus: ఏపీలో మరో 136 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap

  • గత 24 గంటల్లో 15,384 శాంపిళ్ల పరీక్ష 
  • మొత్తం కరోనా కేసులు 4,126
  • ఆసుపత్రుల్లో కరోనాకు 1,573 మందికి చికిత్స
  • 2,475 మంది డిశ్చార్జ్  

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 15,384 శాంపిళ్లను పరీక్షించగా మరో 136 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 72 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,126 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,573 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,475మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 78కి చేరింది.
               

  • Loading...

More Telugu News