Corona Virus: 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా

coronavirus cases in india

  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,66,598
  • మృతుల సంఖ్య 7,466
  • 1,29,917 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 1,29,215 మంది  

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 331 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. 1,29,917 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,215 మంది కోలుకున్నారు.

  • Loading...

More Telugu News