కేరళలో ఏనుగును చంపిన ఘటనపై.. కదిలించే సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
- మానవత్వం మరోసారి విఫలమైందన్న సుదర్శన్ పట్నాయక్
- మానవాళి సిగ్గుపడాలన్న సైకత శిల్పి
- కేరళ ఘటనపై ఆగ్రహం
మానవత్వం మరోసారి విఫలమైందంటూ సుదర్శన్ పట్నాయక్ ఆ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో మానవాళే సిగ్గుపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. పూరీ బీచ్లో తాను ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ సైకత శిల్పం కన్నీళ్లు పెట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన పలు ఫొటోలు, కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.