Corona Virus: ఏపీలో మరో 98 మందికి సోకిన కరోనా

coronavirus cases in ap

  • 24 గంటల్లో 9,986 శాంపిళ్ల పరీక్ష
  • 24 గంటల్లో 29 మంది డిశ్చార్జ్ 
  • మొత్తం కరోనా కేసులు 3,377
  • ఆసుపత్రుల్లో కరోనాకు 1,033 మందికి చికిత్స

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,986 శాంపిళ్లను పరీక్షించగా మరో 98 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,377 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,033 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,273 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 71కి చేరింది.

                           

  • Loading...

More Telugu News