Corona Virus: ఒక్కరోజులో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా!

  biggest jump so far  corona

  • మొత్తం కరోనా కేసులు 1,65,799
  • మృతుల సంఖ్య 4,706
  • 89,987 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 71,106 

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 175 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4,706 చేరుకుంది. 89,987 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71,106 మంది కోలుకున్నారు.

  • Loading...

More Telugu News