Pakistan: కరాచీ విమాన ప్రమాదంలో తేలిన మృతుల లెక్క.. 97 మంది మృతి!

97 dead in karachi flight mishap

  • ల్యాండ్ కావడానికి నిమిషం ముందు కూలిన విమానం
  • ప్రమాద సమయంలో విమానంలో 99 మంది
  • ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు

పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 97కు పెరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 97 మంది మరణించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు, విమానం జనావాస ప్రాంతాల్లో కుప్పకూలడంతో స్థానికుల్లో చాలామంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సందర్భంగా పురుషులు ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లడంతో ఇంటి పట్టున ఉన్న మహిళలు ఎక్కువ మంది గాయపడ్డారు. మృతుల్లో చాలామంది ప్రయాణికులు సీటు బెల్టు ధరించే ఉన్నారని అధికారులు తెలిపారు.

Pakistan
Karachi
flight crash
  • Loading...

More Telugu News