nagababu: నాథూరాం గాడ్సే దేశభక్తిని శంకించలేము.. ఒక నిజమైన దేశభక్తుడు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

nadendla about gadse

  • ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు
  • గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా అనుకున్నది చేశాడు
  • ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది

భారత జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే గురించి జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని పేర్కొన్నారు.

'గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. గాంధీజీని చంపిన వ్యక్తిని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News