Telugudesam: సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం.. దీక్షకు దిగిన టీడీపీ నేతలు అనిత, ఈశ్వరి

TDP leaders Anitha and Giddi Eswari Deeksha

  • విశాఖలో 12 గంటల దీక్షకు దిగిన టీడీపీ నాయకులు 
  • మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన
  • బాటిళ్లను పగలగొట్టేందుకు అనుమతి లేదన్న పోలీసులు

ఏపీలో మద్యం ఏరులై పారుతోందని... మద్యం అమ్మకాల కోసం లాక్ డౌన్ నిబంధనలను సైతం పక్కనపెట్టేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి విమర్శించారు. మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిందని... ఇచ్చిన హామీ మేరకు వెంటనే పూర్తి స్థాయి మధ్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈరోజు విశాఖలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం ఎదుట మద్యం బాటిళ్లను పగలగొట్టారు. మరోవైపు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మద్యం బాటిళ్లను పగలగొట్టేందుకు అనుమతి లేదని చెప్పారు.

Telugudesam
Anitha
Giddi Eswari
Liquor Ban
  • Loading...

More Telugu News