Corona Virus: భారత్‌లో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,320

3320 more COVID19 cases  95 deaths reported in last 24 hours

  • గత 24 గంటల్లో భారత్‌లో 95 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 1,981
  • కేసుల సంఖ్య మొత్తం 59,662
  • ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 39,834 మంది

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,981 చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 3,320 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 59,662కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,847 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో  39,834 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News