Delhi: ప్రాణాల కంటే మందు ఎక్కువైంది: మందుబాబులపై గంభీర్ ఫైర్

Gowtha Gambhir comments on boozers

  • ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన మద్యం అమ్మకాలు
  • వైన్ షాపుల వద్ద ఎగబడ్డ మందుబాబులు
  • సామాజిక దూరాన్ని పాటించని వైనం

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో మందుబాబులు ఎగబడ్డారు. షాపులు తెరిచిన కాసేపు అంతా బాగానే ఉన్నప్పటికీ... కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపుతప్పింది. సామాజిక దూరం, మాస్కులు పెట్టుకోవడం వంటిని కనిపించలేదు.

అంతేకాదు, తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ భయం కూడా లేకుండా మద్యం ప్రియులు వ్యవహరించారు. దీంతో, పలు ప్రాంతాల్లో మద్యం షాపులను పోలీసులు బంద్ చేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మందుబాబులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జనాలకు ప్రాణాల కంటే మందు ఎక్కువైందని ట్వీట్ చేశారు. దీంతోపాటు, మందు షాపుల వద్ద జనాలు ఎగబడుతున్న ఫొటోలను షేర్ చేశారు.

Delhi
Liquor
BJP
Arvind Kejriwal
AAP
Gautam Gambhir
  • Error fetching data: Network response was not ok

More Telugu News