Jharkahand: కుమారుడికి ఆహారం తినిపించే విషయంలో గొడవ.. బెల్ ఇంజినీర్‌ను పొడిచి చంపిన భార్య

wife killed Husband over dispute on food

  • కత్తితో భర్తను దారుణంగా పొడిచిన భార్య
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • బాధితుడిది ఝార్ఖండ్

భార్యాభర్తల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కోపం పట్టలేని భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. చెన్నైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన అఖిలేశ్ కుమార్ (36) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో అసిస్టెంట్ ఇంజినీర్. భార్య అఖిలకుమారి (27), ఐదేళ్ల కొడుకు కుమార్, తల్లి సావిత్రితో కలిసి రాణిపేటలో నివసిస్తున్నాడు. కుమారుడికి ఆహారం తినిపించే విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. శనివారం వీరి మధ్య ఇదే విషయంలో మరోమారు గొడవ జరిగింది.

అది మరింత ముదరడంతో ఆగ్రహం పట్టలేని భార్య అఖిలకుమారి భర్తపై కత్తితో దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన అఖిలేశ్‌ను స్థానికులు వెంటనే బెల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం రాణిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా అఖిలేశ్ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. అఖిలేశ్ తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిప్కాట్ పోలీసులు నిందితురాలు అఖిలకుమారిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News