Rajahmundry: రాజమండ్రిలో రెండు రెడ్‌జోన్ల ఎత్తివేత

Two red zones in Rajahmundry lifted

  • గత 28 రోజులుగా నమోదు కాని కరోనా కేసులు
  • వీరభద్రాపురం, శాంతినగర్ లో రెడ్ జోన్ల ఎత్తివేత
  • కొనసాగుతున్న కంటైన్మెంట్ జోన్లు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ ఆగిపోయింది. తాజాగా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్ ను ఎత్తివేశారు. గత 28 రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో నగరంలోని వీరభద్రాపురం, శాంతినగర్ లో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా... రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఏపీలో నిన్న ఒక్కరోజే 82 పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 1,259కి చేరింది. వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది. భారీ సంఖ్యలో టెస్టింగ్ లను నిర్వహిస్తోంది.

Rajahmundry
Red Zones
Corona Virus
  • Loading...

More Telugu News