Chandrababu: ‘కరోనా’ వ్యాప్తిలో వైసీపీ నేతలు ‘సూపర్ స్ప్రెడర్స్’గా మారారు.. ఇదిగో వీడియో!: చంద్రబాబు

Chandrababu criticises Jagan Govenment

  • లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘించారు
  • ఇవాళ వైజాగ్ లోని  ఫంక్షన్ హాలులో వారు కలిశారు
  • వైజాగ్ ఎంపీ, మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది

‘కరోనా’ వ్యాప్తి చేసే వారిగా వైసీపీ నేతలు మారడం చూసి ఆశ్చర్యపోయానంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా’ వ్యాప్తిలో వైసీపీ నేతలు ‘సూపర్ స్ప్రెడర్స్’గా మారడం చూసి ఆశ్చర్యపోయానని, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వందలాది వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ వైజాగ్ లోని ఓ ఫంక్షన్ హాలులో కలిశారని అన్నారు. ఈ సమావేశానికి వాళ్లందరూ హాజరయ్యారని చెప్పిన చంద్రబాబు, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

ఇదే ఫంక్షన్ హాలులో తాత్కాలిక క్వారంటైన్ కేంద్రం 

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక క్వారంటైన్ కేంద్రం ఇదే ఫంక్షన్ హాలులో ఉందని, కొవిడ్-19 పరీక్షల రిపోర్టు కోసం చాలా మంది అక్కడ వేచి చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా కలవడం ద్వారా వైరస్ బారిన పడే ప్రమాదంపెరుగుతుందని, రెట్టింపు సంఖ్యలో కేసులు పెరిగేందుకు దారితీస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News