Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని కరోనా కేసులు.. మరో 62 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

coronavirus cases in ap

  • కర్నూలులో కొత్తగా 27, గుంటూరులో 11 కేసులు
  • రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 955
  • 24 గంటల్లో ఇద్దరి మృతి
  • ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 29

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కర్నూలులో కొత్తగా 27, గుంటూరులో 11,  అనంతపురంలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయని వివరించింది.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో కరోనాతో 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 29గా ఉంది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 781గా ఉంది. 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 6,306 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. 

ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు?                                                                   
                                                 

  • Loading...

More Telugu News