Simhachalam: అప్పన్న చందనోత్సవానికి ప్రజలు, వీఐపీలను ఆహ్వానించొద్దు: ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

Chandanostavam in Simhachalam

  • ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించండి 
  • చందనోత్సవాన్ని  ప్రత్యక్ష ప్రసారం చేయండి  
  • దేవస్థానం ఈవోకు ఈ మేరకు ఆదేశాలు

విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వేడుకలకు ప్రజలు, వీఐపీలను ఎవరినీ ఆహ్వానించవద్దని దేవస్థానం ఈవోకు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది. నరసింహస్వామికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఈవోను ఆదేశించింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది. 

  • Loading...

More Telugu News