Corona Virus: ఏపీలో మరో 56 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

coronavirus cases in ap

  • మొత్తం  పాజిటివ్ కేసులు 813
  • 120 మంది డిశ్చార్జ్
  • 24 మంది మృతి
  • కర్నూలులో అత్యధికంగా 203 కేసులు  

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 813 కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వారిలో 120 మంది డిశ్చార్జ్ అయ్యారని, 24 మంది మరణించారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669 అని వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 203 కేసులు నమోదు కాగా, వారిలో 194 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఐదుగురు మృతి చెందగా, నలుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 177 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. గుంటూరులో 146 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 23 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 86 మందికి కరోనా సోకగా, 64 మందికి చికిత్స అందుతోంది. 16 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 60 మందికి చికిత్స అందుతోంది. ఆరుగురు డిశ్చార్జ్‌ కాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో 86 మందికి, చిత్తూరు జిల్లాలో 59 మందికి కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలో 48 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?                                                       
                                   

  • Loading...

More Telugu News