Manthena Rama Raju: 12 గంటల నిరాహారదీక్షకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు

Undi MLA Rama Raju hunger strike

  • అన్నా క్యాంటీన్లను వెంటనే తెరిపించాలి
  • పేదలకు రూ. 5 వేల సాయం అందించాలి
  • ఆక్వా రైతులను ఆదుకోవాలి

పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 12 గంటల నిరాహారదీక్షకు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూసి వేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు వెంటనే రక్షణ కిట్లను అందించాలని కోరారు.

Manthena Rama Raju
Hunger Strike
Telugudesam
Undi Constituency
  • Loading...

More Telugu News