Kurnool District: కర్నూలు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఐదుగురికి పాజిటివ్‌

Five new corona cases in kurnool district

  • వెల్లడించిన కలెక్టర్ వీరపాండియన్‌
  • ప్రస్తుతం జిల్లాలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 98కి చేరిక
  • జిల్లాలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు డిశ్చార్జి

కర్నూలు జిల్లాలో కోవిడ్‌-19 బాధితు సంఖ్య పెరుగుతోంది. కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. తాజాగా బయట పడిన ఐదు కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య తొంబై ఎనిమిదికి చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు బాధితుల్లో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు వైరస్‌ నుంచి కోలుకోవడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. కొన్ని జిల్లాల్లో పెరుగుతున్న కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

Kurnool District
Corona Virus
fove positive
  • Loading...

More Telugu News