Rain: వచ్చే 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!

Rain Allert in AP and TS

  • కర్ణాటక మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి
  • ద్రోణి ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ

అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.

దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాంధ్ర, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు అంచనా వేశారు. 

Rain
IMD
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News