Chiranjeevi: ప్రధాని పిలుపుని గౌరవిద్దాం.. ఆ రోజు దీపాలు వెలిగిద్దాం: సినీ హీరో చిరంజీవి

Chiranjeevi says respecting our beloved PMs call
  • మోదీ పిలుపుపై  చిరంజీవి స్పందన
  • ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పివేద్దాం
  • ‘కరోనా’ చీకట్లను పారద్రోలుదాం..దేశం కోసం నిలబడదాం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేసే నిమిత్తం ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను అన్నిటినీ ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

మోదీ పిలుపుపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. మన ప్రియతమ ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామని, ఆ సమయానికి అందరం దీపాలు వెలిగిద్దామని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘కరోనా’ చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు.
Chiranjeevi
Tollywood
Hero
Narendra Modi
April 5th
light lamps

More Telugu News