KTR: రూ.5.25 కోట్ల విరాళ మిచ్చిన ‘వాల్యూ ల్యాబ్స్’కు కృతజ్ఞతలు: మంత్రి కేటీఆర్

Minister Ktr thanks to Value Labs

  • ‘కరోనా’ కట్టడికి విరాళం ఇచ్చిన వాల్యూ ల్యాబ్స్
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్  
  • కేటీఆర్ కు చెక్ అందజేసిన ’వాల్యూ ల్యాబ్స్‘

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతుగా వాల్యూ ల్యాబ్స్ సంస్థ రూ.5.25 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. సంబంధిత చెక్ ను మంత్రి కేటీఆర్ కు వాల్యూ ల్యాబ్స్ అందజేసింది.

ఈ సందర్భంగా వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనా’ కట్టడికి విరాళాలు ఇవ్వదలచుకున్న వారు ఆన్ లైన్ ద్వారా కూడా పంపవచ్చని ట్వీట్ చేసిన కేటీఆర్, సంబంధిత లింక్ ను, చెక్ ద్వారా విరాళం ఇవ్వదలచకున్నవారి కోసం అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను తెలియజేశారు.

KTR
trs
Telangana
Values Labs
Corona Virus
Donation
  • Error fetching data: Network response was not ok

More Telugu News