తెలుగు రాష్ట్రాలకు తమ విరాళాన్ని ప్రకటించిన కొరటాల, అనిల్ రావిపూడి
- రోజులు భారంగా గడుపుతున్న సామాన్యులు
- కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చర్యలు
- పదేసి లక్షల చొప్పున విరాళాలు
ఈ విపత్తును ఎదుర్కోవడానికిగాను తమవంతు సాయాన్ని అందిస్తామంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు .. దర్శకులు తమ విరాళాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో కొరటాల శివ .. అనిల్ రావిపూడి కూడా చేరిపోయారు. ఈ ఇద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి వేరు వేరుగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.