Bhopal: భోపాల్ లో జర్నలిస్టుకు సోకిన కరోనా!

Bhopal Journalist tests corona positive

  • ఈ నెల 17న లండన్ నుంచి వచ్చిన పాత్రికేయుడి కుమార్తె
  • అతడితోపాటు మీడియా సమావేశానికి హాజరైన వారికి హోం క్వారంటైన్ ఆదేశాలు
  • జర్నలిస్టు కుమారుడు, భార్యకు కరోనా నెగటివ్

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ పాత్రికేయుడికి కరోనా వైరస్ సోకింది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు అదే సమావేశానికి హాజరైన మిగతా జర్నలిస్టులను హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, బాధిత జర్నలిస్టుకు అతడి కుమార్తె ద్వారా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.

మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క భోపాల్‌లోనే 15 కరోనా కేసులు నమోదయ్యాయి.

Bhopal
Journalist
Corona Virus
Madhya Pradesh
  • Loading...

More Telugu News