ఎవడో ఆర్డరిస్తున్నాడు..ఈయన చదువుతున్నాడంటూ రమేశ్ కుమార్ పై జగన్ ఆగ్రహం
- ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా వేస్తూ నాలుగు పేజీల ఆర్డర్ ఇచ్చారు
- ఆ ఆర్డర్ సంగతి ఎన్నికల సంఘంలోని సెక్రటరీకే తెలియదు
- సీఎస్, హెల్త్ సెక్రటరీలను సంప్రదించకుండానే ఆర్డరిచ్చారు!
‘కరోనా’ వైరస్ పేరిట ఎన్నికలు వాయిదా ఆర్డరు ఇచ్చేముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెల్త్ సెక్రటరీలను సంప్రదించలేదని, వారి సలహాలు, సూచనలు తీసుకోలేదని రమేశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. కానీ, ఆర్డర్ కాపీలో మాత్రం వారి సలహాలు తీసుకుంటున్నట్టు రాశారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడే ఆయనకు ఈ పదవి ఇచ్చి ఉండొచ్చు, వాళ్లిద్దరి సామాజికవర్గం ఒకటే కావొచ్చు కానీ ఇంత వివక్షచూపడం ధర్మేమనా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? అన్ని ప్రశ్నించారు.