Sunil Deodhar: వైసీపీపై గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన సునీల్ దేవధర్

Sunil Deodhar complains governor over YSRCP

  • గవర్నర్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జి దేవధర్
  • వైఎస్ హయాంలోనూ ఇంత అరాచకం లేదని వ్యాఖ్యలు
  • పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం పట్ల రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. వైఎస్ హయాంలోనూ ఇంత అరాచకం లేదని, వైసీపీ ఓ రౌడీ పార్టీలా వ్యవహరిస్తోందని అన్నారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారని వెల్లడించారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి బీజేపీ నేతలకు ప్రాణహాని ఉందని దేవధర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Sunil Deodhar
Governor
Biswabhusan Harichandan
YSRCP
BJP
Local Body Polls
Andhra Pradesh
  • Loading...

More Telugu News