Prakasam District: ప్రకాశం జిల్లా పరిణామాల నేపథ్యంలో.. అక్కడి నేతలతో చంద్రబాబు సమావేశం

Naidu meet prakasham district party cader

  • ఎమ్మెల్యే కరణం పార్టీ వీడనున్నారన్న సమాచారంతో జాగ్రత్త 
  • ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం 
  • తదుపరి పరిణామాలపై చర్చ

ఎమ్మెల్యేగా గెలుపొందినా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని ఎప్పటి నుంచో వాపోతున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కరణం నిష్క్రమించినా పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించేందుకు జిల్లా పార్టీ నేతలతో ఈ రోజు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామితోపాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు.

Prakasam District
Chandrababu
party meet
Karanam Balaram
  • Loading...

More Telugu News