Mancherial District: పెళ్లయిన 18 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క అమ్మాయిని కాటేసిన పాము.. చికిత్స పొందుతూ మృతి

girl dies of snakebite

  • మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ఘటన
  • పాపను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న తల్లిదండ్రులు
  • బిడ్డ దూరమవడంతో గ్రామంలో విషాదం

మంచిర్యాల జిల్లా భీమిని మండలం మాల్లాడి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ జంటకు పెళ్లయి 18 ఏళ్లు గడిచినప్పటికీ పిల్లలు పుట్టలేదు. చివరకు తొమ్మిదేళ్ల క్రితం ఓ పాప పుట్టింది. ఆమెకు దీపిక అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే, ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న ఆ పాపను పాము కాటేసింది.

దీంతో తల్లిదండ్రులు మొదట ఆమెను గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి, అనంతరం అక్కడినుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు విడిచింది. ఆ బాలిక స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఒక్కగానొక్క బిడ్డ దూరమైపోయిందని  ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News