Uttar Pradesh: నరమాంసంతో కూర వండేందుకు ప్రయత్నించిన తాగుబోతు

Uttar Pradesh man try to cook dead man hand

  • ఉత్తరప్రదేశ్ లో భయానక ఘటన
  • శ్మశానం నుంచి శవం చేయి తీసుకువచ్చిన తాగుబోతు
  • ఆ చేయిని కోసి కూర చేస్తుండగా చూసిన భార్య
  • ఇరుగుపొరుగు సమాచారంతో పోలీసుల రాక

ప్రపంచంలోని కొన్ని ఆటవిక జాతుల ప్రజలు నరమాంస భక్షకులని విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ అనే తాగుబోతు మద్యం మత్తులో నరమాంసంతో కూర వండేందుకు ప్రయత్నించడం భీతిగొలుపుతోంది. బిజ్నూర్ జిల్లాకు టిక్కోపూర్ కు చెందిన 32 ఏళ్ల సంజయ్ మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు. తాగితే అతడి చేష్టలకు అంతూ పొంతూ ఉండేది కాదు. ఎప్పట్లాగే సోమవారం రాత్రి బాగా మద్యం సేవించిన సంజయ్ కి వింత కోరిక కలిగింది. దాంతో శ్మశానానికి వెళ్లి అక్కడ ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర చేసేందుకు ఉపక్రమించాడు.

ఇంటికి వచ్చిన భార్య కిచెన్ లో జరుగుతున్న తతంగం చూసి హడలిపోయింది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మద్యం నిషాలో ఉన్న సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంజయ్ వింత పనులు చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే విచిత్రంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.

Uttar Pradesh
Drunken
Man
Hand
Curry
Police
  • Loading...

More Telugu News