Srishailam: ఇప్పటికిప్పుడు శ్రీశైలం డ్యామ్ కు వచ్చిన ప్రమాదమేమీ లేదు: ప్యానల్ కమిటీ చైర్మన్ పాండ్య

Pandya says no threat to Srishailam dam

  • శ్రీశైలం డ్యామ్ కు ముప్పు ఉందని ప్రచారం
  • ఆనకట్ట పరిరక్షణకు కొన్ని సూచనలు చేశామన్న సేఫ్టీ కమిటీ
  • కొన్ని అంశాలపై సంబంధిత సంస్థలతో విచారణ జరపాలని వెల్లడి

శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉందని, డ్యామ్ కు ప్రమాదం వాటిల్లితే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ ప్యానల్ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్య స్పందించారు. ఇప్పటికిప్పుడు శ్రీశైలం డ్యామ్ కు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు.

ఆనకట్ట పరిరక్షణకు కీలక సూచనలు చేశామని, కొన్ని అంశాలపై సంబంధిత సంస్థలతో విచారణ జరపాలని స్పష్టం చేశామని వెల్లడించారు. శ్రీశైలం ఆనకట్ట నిర్వహణ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. డ్యామ్ నిర్వహణ ఖర్చుల కోసం డ్రిప్, ఇతర నిధులను వినియోగించుకోవాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు పాండ్య వెల్లడించారు.

Srishailam
Project
Dam
Safety Committee
Chairman
Pandya
  • Loading...

More Telugu News